Monday, November 17, 2025
Homeనేషనల్Rahul Gandhi: తండ్రిని తలుచుకుని రాహుల్ గాంధీ ఎమోషనల్

Rahul Gandhi: తండ్రిని తలుచుకుని రాహుల్ గాంధీ ఎమోషనల్

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్‌భూమిలో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ అగ్రనేత, లోకస‌భ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ సతీమణి, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ మేరకు రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఎమోషన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా నీ జ్ఞాపకాలు ప్రతి అడుగులో నాకు మార్గదర్శనం చేస్తాయి. నీ కలలను సాకారం చేయడమే నా సంకల్పం. వాటిని తప్పకుండా నెరవేరుస్తా’ అంటూ రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad