Sunday, May 19, 2024
Homeనేషనల్Renuka Chowdhary: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు?

Renuka Chowdhary: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు?

దమ్ముంటే ప్రజ్వల్ రేవన్నని పట్టుకోండి

బీజేపీపై ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని రేణుక నిలదీశారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించిన ఆమె..ఏ హక్కుతో గాంధీ భవన్ వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవన్నని పట్టుకోండని సవాలు విసిరారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవన్న పారిపోయాడన్న రేణుకా చౌధరి, ప్రజ్వల్ ని బలపరిస్తే నన్ను బలపర్చినట్టే అని మోదీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు సైలెంట్ గా ఉంటున్నారని, బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేస్తే మళ్ళీ టికెట్ ఇచ్చారని..దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని నిలదీశారు. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ మాట్లాడడం లేదని, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్ కి వస్తున్నారని రేణుక ఆరోపించారు. జవాన్లు, రైతులు అనే రెండు పెద్ద సెక్యులర్ ఫోర్సెస్ దేశంలో ఉన్నాయని, పెద్ద ఛాతీ ఉండడం కాదు దానిలో గుండె, మనసు కూడా ఉండాలని మోడీపై ఆమె మాటల దాడి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News