Wednesday, May 7, 2025
Homeనేషనల్Amit Shah: ఆర్మీ సిబ్బందికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు

Amit Shah: ఆర్మీ సిబ్బందికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరిట భారత బలగాలు పాక్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) స్పందిస్తూ ‘పహల్గామ్‌లో మన అమాయక సోదరుల దారుణ హత్యకు ఇది భారత్ ఇచ్చిన సమాధానం’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

అయితే ఈ దాడి తర్వాత పాక్ రేంజర్లు సరిహద్దు వెంబడి భారత గ్రామాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో పది మంది భారత పౌరులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు అమిత్‌ షా ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News