Thursday, June 12, 2025
HomeNewsCHARGES ON DIGITIAL TRANSACTIONS: యూపీఐ షాక్ ₹3,000 దాటితే ఛార్జీల మోత!

CHARGES ON DIGITIAL TRANSACTIONS: యూపీఐ షాక్ ₹3,000 దాటితే ఛార్జీల మోత!

CHARGES ON DIGITIAL TRANSACTIONS: కొవిడ్ -19 కారణంగా దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ఎంతగా అంటే.. మనం ఒక చిన్న షాపులో టీ తాగినా, ఇంట్లో సరుకులు తెచ్చుకున్నా… జేబులోంచి వందల రూపాయల నోట్లు తీసి ఇచ్చే రోజులు దాదాపుగా పోయాయి. “భయ్యా” ఫోన్‌పే ఉందా..? అని అడగడం క్షణాల్లో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బు పంపేస్తున్నాం. ఎంత సులభం కదా.? ఈ గూగుల్‌పేలు, ఫోన్‌పేలు వచ్చాక చిల్లర సమస్యతో పాటుగా దొంగలు డబ్బులు కొట్టేస్తారన్న భయం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్లోంచి నేరుగా ఖర్చు పెట్టేయొచ్చు. కానీ.. ఇదంతా ఒక కలలా మారిపోతుందనే వార్త ఇప్పుడు సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

- Advertisement -

రోజుకు రూ. 3,000 కన్నా ఎక్కువ పంపించామంటే :
విషయం ఏంటంటే…త్వరలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వడ్డించేందుకు కేంద్రం యోచిస్తుంది. ముఖ్యంగా.. రోజుకు రూ. 3,000 కన్నా ఎక్కువ మనం ఎవరికైనా పంపించామంటే, ఆ లావాదేవీపై ‘మెర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌’ (MDR) అనే ఛార్జీ పడుతుందట. అంటే, మనం డబ్బు పంపిన వర్తకుడికి (లేదా సేవలు అందించిన వారికి) ఆ ఛార్జీ పడుతుంది.

బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లకు పెరిగిన భారం :
యూపీఐ లావాదేవీల వల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణకు భారీ ఖర్చులు అవుతున్నాయి. ఈ ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకే ఛార్జీలు విధించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. గతంలో (2020కి ముందు) MDR (మెర్చంట్ డిస్కౌంట్ రేట్) పేరిట ఛార్జీలు వసూలు చేసేవారు. అంటే, మనం ఏదైనా వస్తువు కొని యూపీఐ ద్వారా డబ్బు పంపితే, అందులో కొంత శాతం సర్వీస్ ప్రొవైడర్లు తీసుకునేవారు.

జీరో ఎండీఆర్’తో పెరిగిన లావాదేవీలు :
2020లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ‘జీరో ఎండీఆర్’ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. దీని వల్ల డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో జరిగే మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 80 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల విలువ ₹60 లక్షల కోట్లకు చేరింది.

తిరిగి ఛార్జీలు ఎందుకు..?
జీరో ఎండీఆర్ విధానం వల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని, ఇది తమకు భారంగా మారిందని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తే లాభాలు పెరిగి, ఆ డబ్బును మళ్లీ యూపీఐ సేవల్లోనే పెట్టుబడిగా పెట్టి, దీర్ఘకాలంలో యూపీఐ వ్యవస్థను మరింత స్థిరంగా, బలంగా మార్చవచ్చని వారు వాదిస్తున్నారు.

ప్రభుత్వ ఆలోచన ఏంటి? ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో 80% యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అయితే, లావాదేవీలపై 0.3% ఎండీఆర్ (MDR) విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే పీఎంఓ సహా ఆర్థిక శాఖల అధికారులు చర్చించారు. రాబోయే రెండు నెలల్లో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్‌పీసీఐలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర వర్గాలు తెలిపాయి. యూపీఐని మరింత ప్రోత్సహించడమే కాకుండా, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ దీర్ఘకాలం నిలకడగా ఉండటానికి ఈ ఛార్జీలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News