Dil Raju Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం సినిమాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి సత్కరించడమే ద్యేయంగా తీసుకొచ్చిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. అవార్డుల వేడుక ఘనంగా జరిపినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఇండస్ట్రీ తరఫున తెలుపుకున్నారు. అయితే పలువురు నటులపై దిల్ రాజు మండిపడ్డారు.
అవార్డుల ఫంక్షన్ కు గైర్హాజరైన వారిపై దిల్ రాజు సీరియస్ అయ్యారు. విజేతలు తమ తమ షెడ్యూల్లో బిజీగా ఉన్నా, ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు వాటికి గౌరవం ఇవ్వాలన్నారు. కాసేపు పనిని పక్కకునెట్టి వారే స్వయంగా అవార్డులను అందుకుంటే బాగుండేది అన్నారు. ఈ అవార్డుల ఎంపిక కోసం జ్యూరీ సభ్యులంతా 6 నెలలు శ్రమించారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అంతా ప్రభుత్వంతో కలసి మెలసి నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇకపై ఏపీ ప్రభుత్వం కూడా సినిమా అవార్డులు ఇస్తుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. నటులు ఆ ఫంక్షన్ కు కచ్చితంగా హాజరు కావాలని అక్కడికి కూడా అవార్డుకి ఎంపికైన వాళ్లు కచ్చితంగా వెళ్లాలి అని రిక్వెస్ట్ చేశారు దిల్రాజు.
ప్రభుత్వంతో కలిసి ప్రయాణించాల్సిన బాధ్యత మన సినిమా వాళ్లందరి పైనా ఉంది. ఇకనుంచి గవర్నమెంట్ తరఫున ఇచ్చే ఏ అవార్డుల వేడుకకైన
మనమంతా అటెండ్ అవ్వాలి. విజేతలంతా అవార్డును తప్పకుండా తప్పక తమ చేతులతో స్వీకరించాలి. నేను చిత్ర పరిశ్రమకు చేస్తున్న నా వ్యక్తిగత విజ్ఞప్తి ఇది. అందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి సినిమాకు సంబంధించి ఇస్తున్న నంది అవార్డులను నిలిపివేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్ళకు అవార్డులు ఇవ్వడం మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఓ కమిటీ ను ఎన్నుకున్నారు. ఆ జ్యూరీ సభ్యులంతా 2014 ఏడాది నుంచి 2023 ఏడాది వరకు ప్రతి ఏటా 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం తో పాటు వివిధ విభాగాల్లో నటి నటులను ఎంపిక చేసి అవార్డులను ప్రధానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా విజేతలకు అవార్డులను అందజేశారు.