Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్High Tension In Tadipathri: తాడిపత్రిలో వాడివేడిగా రాజకీయం.. భారీగా పోలీసుల మోహరింపు!

High Tension In Tadipathri: తాడిపత్రిలో వాడివేడిగా రాజకీయం.. భారీగా పోలీసుల మోహరింపు!

Tension In Tadipathri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాక వార్తతో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు సైతం ఇద్దరు నేతల ఇళ్ల వద్ద  భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే తాడిపత్రి పట్టణంలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.

- Advertisement -

అనుచరుల తరలింపు: తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. సుమారు 300 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి భయానకంగా మారింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అదే సమయంలో టీడీపీ నాయకులు, “పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తాం” అంటూ జేసీ ప్రభాకరెడ్డి సైతం హెచ్చరించినట్లు సమాచారం.

హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ: ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతులున్నా, పోలీసులు తనను తాడిపత్రిలోకి అనుమతించలేదని ఆరోపించారు. దీంతో ఆయన ఎలాగైనా తాడిపత్రిలో అడుగుపెడతానని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు పోలీసు బలగాలతో ఇద్దరు నాయకుల ఇళ్ల వద్ద అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి టీడీపీ నాయకులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేతిరెడ్డి ఇంటి నుంచి కూడా ఏ ఒక్కరూ బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు, పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టారు.

సద్దుమణిగిన వాతావరణం: ఎన్నికల తర్వాత అక్కడ జరిగిన గొడవల నేపథ్యంలో తాడిపత్రికి దూరంగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తిరిగి వస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన రాకను అడ్డుకోవడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద గుమిగూడారు. అయితే, పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులు ధృవీకరించడంతో, టీడీపీ కార్యకర్తలను అక్కడి నుండి పంపించివేశారు. ఈ పరిణామంతో తాడిపత్రిలో నెలకొన్న హైటెన్షన్ వాతావరణం సద్దుమణిగింది. అయితే ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉండటంతో తాడిపత్రి పట్టణంలో పోలీసుల పహారా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News