Saturday, July 27, 2024
HomeNewsHuzurabad: ఎమ్మెల్యే కాదు ఆయనో బ్లాక్ మెయిల్ స్టార్: వొడితల ప్రణవ్

Huzurabad: ఎమ్మెల్యే కాదు ఆయనో బ్లాక్ మెయిల్ స్టార్: వొడితల ప్రణవ్

కౌశిక్ Vs ప్రణవ్

ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆధారాల్లేకుండా నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదని, కౌశిక్ రెడ్డిని చూసి ఎమ్మెల్యే పదవి సైతం సిగ్గుపడుతుందని, ఫ్లై యాష్ కి వేబిల్ ఉండదని కూడా ఎమ్మెల్యేకు తెలువకపోవడం బాధాకరమని, నేటి నుంచి బ్లాక్ మెయిల్ స్టార్ గా కౌశిక్ రెడ్డికి నామకరణం చేస్తున్నట్లు
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ పేర్కొన్నారు పేర్కొన్నారు.

- Advertisement -

పొన్నం కాదు ఆ ఛాలెంజ్ కు నేను రెడీ..
హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లై యాష్ స్కామ్ గురించి సవాల్ విసిరారని, మంత్రి పొన్నం వరకు అవసరం లేదని తాను సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. చర్చకు ఎక్కడికైనా రెడీ అని అవసరమైతే లారీ అసోసియేషన్ సభ్యులను కూడా చర్చకు ఆహ్వానిస్తామన్నారు. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలని నిరాధార ఆరోపణలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ని జంగా ఫ్లై యాష్ కు సంబంధించిన స్కాం ఉంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అసలు ఫ్లై యాష్ కి మంత్రికి సంబంధమేముంటుందని ఆయన ప్రశ్నించారు.

భయంతోనే ఇలాంటి ఆరోపణలు..
ఫ్లై యాష్ కేంద్రానికి సంబంధం ఉండదని, అది వేస్ట్ మెటీరియల్ గా దానిని బయటకు విక్రయిస్తారని అన్నారు. అసలు ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ కు వే బిల్ ఉండదని కనీస జ్ఞానం కూడా ఎమ్మెల్యేకు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్నాడని భయంతో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫ్లై యాష్ విషయంలో ఇప్పటికే లారీ అసోసియేషన్ సభ్యులు వీడియో కూడా విడుదల చేశారని, తమని ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేయద్దు అని ఆ వీడియోలో పేర్కొన్నట్లు తెలిపారు. ఒక ట్రాన్స్పోర్ట్ లారీ మెటీరియల్ తో కలిపి కూడా 70 టన్ను ఉండదని ఇంత చిన్న విషయం కూడా తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే గతంలో కూడా ఎంతోమంది అధికారులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.

అందుకే బ్లాక్ మెయిల్ స్టార్..

కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఇకపై అతనికి బ్లాక్మెయిల్ స్టార్ గా నామకరణం చేస్తున్నామన్నారు. కౌశిక్ రెడ్డి ఐరన్ లెగ్ అని వైఎస్ఆర్సిపి లో ఉంటే తెలంగాణలో పార్టీ మనుగడ లేకుండా పోయిందని, కాంగ్రెస్ లో ఉన్నంతకాలం పార్టీ అధికారంలోకి రాలేదని బిఆర్ఎస్ కి చేరగానే బిఆర్ఎస్ అధికారం కోల్పోయిందని ఎద్దేవ చేశారు. కెసిఆర్, కేటీఆర్ కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులను పక్కకు పెట్టుకుంటే వారి గౌరవం కూడా తగ్గుతుందన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరు విజయ్ కుమార్, పొనగంటి మల్లయ్య, కాజీపేట శ్రీనివాస్, మిడిదొడ్డి శ్రీనివాస్, మిడిదొడ్డి రాజు, అమర్, కొలిపాక శంకర్, సొల్లు బాబు, పుష్పలత, లంక దాసరి, చందమల్ల బాబు, సమ్మెట సంపత్, మంద బిక్షపతి, లావణ్య, మేకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News