Wednesday, September 18, 2024
HomeతెలంగాణJadcharla: మాజీ మంత్రికి జర్నలిస్టుల పరామర్శ

Jadcharla: మాజీ మంత్రికి జర్నలిస్టుల పరామర్శ

పరామర్శ..

మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని జడ్చర్ల జర్నలిస్టులు పరామర్శించారు. ఇటీవల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా జడ్చర్ల జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్వగ్రామం ఆవంచలో లక్ష్మారెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్వేతా రెడ్డి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన వారిలో జడ్చర్ల జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ కృష్ణ, కో కన్వీనర్ లు శ్రీధర్, శ్రీనివాసులు, తెలుగు ప్రభ జడ్చర్ల జర్నలిస్ట్ గోనెల నరేందర్, జర్నలిస్టులు జయపాల్, యాదిలాల్, బాబు, సత్తార్, జమీర్, బాసిత్, అబ్దుల్లా యూసుఫ్, మోహిన్, అహ్మద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News