Tuesday, June 17, 2025
HomeతెలంగాణSeethakka: సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం..!

Seethakka: సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశం..!

రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలో అమలవుతున్న ప్రగతి పనుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర పెండింగ్ అంశాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

- Advertisement -

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్ శ్రీధర్, పీ ఆర్ ఆర్ డీ డైరెక్టర్ జి సృజన, స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, ENC లు కృపాకర్ రెడ్డి, కనక రత్నం, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి.. గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు ఎఫెక్టివ్ డేట్, జేపీఎస్ నుండి గ్రేడ్ 4 కార్యదర్శుల అప్గ్రేడ్, ఓపీఎస్ అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్రీధర్ గారు రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త బాధ్యతల్లో విజయం కలగాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News