Friday, September 20, 2024
HomeNewsRavichandra: కేసీఆర్ ఆరోగ్యం కోసం ఎంపీ రవిచంద్ర పూజలు

Ravichandra: కేసీఆర్ ఆరోగ్యం కోసం ఎంపీ రవిచంద్ర పూజలు

రవిచంద్ర, గంగుల కుటుంబం ప్రత్యేక పూజలు

కేసీఆర్ త్వరితగతిన కోలుకోవాలి ఆకాంక్షిస్తూ ఎంపీ రవిచంద్ర ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనగర్ కాలనీ శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు వద్దిరాజు, గంగుల కుటుంబీకులు.

- Advertisement -

తమ గోత్రనామాలతో నాగదేవత, శ్రీఆంజనేయ శ్రీవెంకటేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు వద్దిరాజు, గంగుల కుటుంబ సభ్యులు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోక కళ్యాణార్థం, దేశం సుభిక్షంగా వర్థిల్లాలని కాంక్షిస్తూ, ప్రమాదవశాత్తు గాయపడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కే.చంద్రశేఖర రావు గారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.నగరంలోని శ్రీనగర్ కాలనీ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం వద్దిరాజు, గంగుల కుటుంబీకులు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా జరిపించారు.

సుమారు మూడు గంటల పాటు జరిపించిన ఈ వ్రతంలో వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమామహేశ్వరి, వద్దిరాజు నిఖిల్ చంద్ర-అనీల, గంగుల సందీప్-డాక్టర్ గంగాభవాని దంపతులు భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు.అంతకుముందు వారు ఆలయ ప్రాంగణంలోని నాగదేవత, శ్రీఆంజనేయ, శ్రీవెంకటేశ్వర, అయ్యప్ప స్వాములకు తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వ్రతం, పూజల్లో వద్దిరాజు నాగరాజు, వద్దిరాజు శివ ప్రీతమ్, వద్దిరాజు గిరినందన్, గంగుల సనవ్, గంగుల సౌరవ్, వద్దిరాజు సహశ్రిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వీరికి పూలమాలలు, కండువాలు వేసి ఆశీర్వచనాలు పలికారు, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News