Sahitya Akademi Awards : భారత సాహిత్య రంగంలో విశిష్ట స్థానం కలిగిన సాహిత్య అకాడమీ పురస్కారాలలో భాగంగా, కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం యువ, బాల సాహిత్య అవార్డులను ప్రకటించింది.
బాల సాహిత్య పురస్కారాలు 2025
తెలుగులో ప్రసాద్ సూరి ‘మైరావణ’కు యువ పురస్కారం, గంగిశెట్టి శివకుమార్ ‘కబుర్ల దేవత’కు బాల సాహిత్య అవార్డు లభించాయి. మొత్తం 23 భాషలకు చెందిన యువ రచయితలకు (డోగ్రీ మినహా) పురస్కారాలు దక్కగా, ఇంగ్లీషులో అద్వైత్ కొట్టారి, హిందీలో పార్వతి తిర్కీ ఉన్నారు.
అవార్డు ప్రదానం, ఎంపిక ప్రక్రియ
ఈ విజేతలకు అకాడమీ ఒక తామ్రపత్రం, రూ.50,000 నగదు బహుమతి అందజేయనుంది. విజేతల ఎంపిక ప్రక్రియ జ్యూరీ సిఫార్సుల ఆధారంగా, అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని కార్యనిర్వాహక మండలిచే నిర్ణయించబడింది.
యువ పురస్కార విజేతలు – 2025
అస్సామీ – సుప్రకాశ్ భుయాన్
బెంగాలీ – సుదేష్నా మోయిత్రా
బోడో – అమర్ ఖుంగూర్ బోరో
గుజరాతీ – మయూర్ ఖవ్డు
కన్నడ – ఆర్ దిలీప్ కుమార్
కాశ్మీరీ – సైక్వా సెహర్
కొంకణీ – గ్లినిస్ డయాస్
మైతిలీ – నేహా ఝా మణి
మలయాళం – అఖిల్ పి. ధర్మజన్
మణిపురి – ఏకే జితెన్
మరాఠీ – ప్రదీప్ కోకర్
నేపాళీ – సుభాష్ థాకురీ
ఒడియా – సుభ్రత్ కుమార్ సేనపతి
పంజాబీ – మందీప్ ఔలఖ్
రాజస్థానీ – పూనమ్ చంద్ గోదారా
సంస్కృతం – ధీరజ్ కుమార్ పాండే
సంతాళీ – ఫాగు బాస్కే
సింధీ – మంథన్ బచ్చానీ
తమిళం – లట్ష్మిహార్
ఉర్దూ – నేహా రుబాబ్
బాల సాహిత్య పురస్కార విజేతలు – 2025
అస్సామీ – సురేంద్ర మోహన్ దాస్
బెంగాలీ – త్రిదిబ్ కుమార్ చటర్జీ
బోడో – బినయ్ కుమార్ బ్రహ్మ
డోగ్రీ – పి.ఎల్. పరిహార్ షౌక్
గుజరాతీ – కీర్తిదా బ్రహ్మభట్ట
కన్నడ – కె. శివలింగప్ప హాండిహాల్
కాశ్మీరి – ఇజ్హార్ ముబాషిర్
కొంకణీ – నయన అడర్కర్
మైతిలీ – మున్ని కమట్
మలయాళం – శ్రీజిత్ మూథేడత్
మణిపురి – శాంటో ఎం
మరాఠీ – సురేశ్ సావంత్
నేపాళీ – సంగ్ము లెప్చా
ఒడియా – రాజకిశోర్ పార్హి
పంజాబీ – పాలి ఖదిమ్ (అమృత్ పాల్ సింగ్)
రాజస్థాని – భోగీలాల్ పటిదార్
సంస్కృతం – ప్రీతీ పుజారా
సంతాళీ – హరలాల్ ముర్ము
సింధీ – హీనా అగ్నాని
తమిళం – విష్ణుపురం సర్వణన్
ఉర్దూ – ఘజనఫర్ ఇక్బాల్