Tuesday, June 17, 2025
HomeNewsSBI shocks credit card users : ఆ బెనిఫిట్స్‌ తొలగింపు

SBI shocks credit card users : ఆ బెనిఫిట్స్‌ తొలగింపు

SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 2025 నుండి, క్రెడిట్ కార్డ్ చెల్లింపు విధానాలలో అనేక ముఖ్యమైన మార్పులు రానున్నాయి. ఈ నూతన మార్పులు జూలై 15, 2025 నుండి అమల్లోకి వచ్చి, క్రెడిట్ కార్డ్ చెల్లింపు నిబంధనలు, బీమా కవరేజీ తో పాటు ఇతర సేవలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ మార్పులు వినియోగదారుల ఆర్థిక ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.

విమాన ప్రమాద బీమా ఎత్తివేత: SBI తన క్రెడిట్ కార్డులపై అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మార్పులు వివిధ కార్డులకు వేర్వేరు తేదీల నుండి అమలులోకి రానున్నాయి.

జూలై 15, 2025 నుంచి : ఎంపిక చేసిన SBI కార్డులైన ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ (SBI Card Elite), ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ (SBI Miles Elite), ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ (SBI Miles Prime) వంటి వాటిపై ప్రస్తుతం అందిస్తున్న రూ. 1 కోటి ఇన్సూరెన్స్ కవరేజీ ఇకపై వర్తించదు. అదేవిధంగా, ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్ (SBI Card Prime), ఎస్‌బీఐ కార్డ్ ప్లస్ (SBI Card Plus) వంటి కార్డులపై లభిస్తున్న రూ. 50 లక్షల ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీని కూడా జూలై 15, 2025 నుంచే తొలగిస్తున్నారు.

ఆగస్టు 11, 2025 నుంచి: SBI కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న విమాన ప్రమాద బీమా కవరేజీని కూడా నిలిపివేయనున్నట్లు SBI తెలిపింది. ఇందులో యూకో బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ లైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, బీఎస్‌బీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్‌బీఐ సిగ్నేచర్ కార్డ్, అలహాబాద్ బ్యాంక్ ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్ వంటివి ఉన్నాయి. ఈ కార్డులపై లభించే రూ. 1 కోటి, రూ. 50 లక్షల ఎయిర్ యాక్సిడెంట్ కవరేజీ ఇకపై అందుబాటులో ఉండదు.

కనీస మొత్తం డ్యూ (Minimum Amount Due – MAD) కాలిక్యులేషన్ మార్పులు: జూలై 15, 2025 నుంచి క్రెడిట్ కార్డ్ బిల్లుల కనీస మొత్తం డ్యూ (MAD) లెక్కించే పద్ధతిలోనూ కీలక మార్పులు రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం MAD కింది విధంగా లెక్కించబడుతుంది.

100 శాతం జీఎస్టీ (GST)
ప్లస్ 100 శాతం ఈఎంఐ (EMI) మొత్తం
ప్లస్ 100 శాతం ఛార్జీలు
ప్లస్ 100 శాతం ఫైనాన్స్ ఛార్జీలు
ప్లస్ ఏదైనా ఓవర్ లిమిట్ అమౌంట్
ప్లస్ 2 శాతం ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్
ఈ మార్పుల వల్ల కనీస మొత్తం డ్యూ పెరుగుతుందని, ఇది వినియోగదారులకు అదనపు భారాన్ని కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పేమెంట్ సెటిల్‌మెంట్ ఆర్డర్‌లో మార్పులు: చెల్లింపుల సెటిల్‌మెంట్ ఆర్డర్ (Order of Payment Settlement)లో కూడా జూలై 15, 2025 నుంచే కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. ఈ మార్పుల పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఇది వినియోగదారులు తమ బకాయిలను చెల్లించే క్రమాన్ని ప్రభావితం చేయనుంది.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News