Monday, May 20, 2024
Homeపాలిటిక్స్Bethamcharla: కోట్ల చిత్ర దూకుడు

Bethamcharla: కోట్ల చిత్ర దూకుడు

ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్న చిత్ర

కోట్ల చిత్ర ఇప్పుడు రాష్ట్రంలో సంచలన యువ నేతగా ఎదిగారు. ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఆమె.. అన్ని ప్రాంతాల్లోనూ కలియ తిరుగుతూ బేతంచర్లలో ప్రచారాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. దీంతో స్థానికులంతా చిత్ర అంటే చాలు మా చిత్రమ్మ అంటూ అక్కున చేర్చుకుంటున్నారు.

- Advertisement -

బేతంచెర్ల నగర పంచాయతీ 8,13 వ కౌన్సిల్ వార్డులన నందు బాబు- షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం పట్టణ అధ్యక్షురాలు, బుగ్గన ప్రసన్న లక్ష్మి, మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య అధ్యక్షతన స్థానిక టిడిపి నాయకులు పోలూరు రాఘవ రెడ్డి భీమేశ్వరరెడ్డి,జాకిరుల్లా బేగ్, బుగ్గన మాధవి రెడ్డి,ముల్లా,గూటం శివ, రామవరం శివ, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కోట్ల చిత్రమ్మ మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. వైసిపి నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప, రాష్ట్ర అభివృద్ధి గురించి గెలిపించిన ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని వారన్నారు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డినిరాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో కోట్ల గిరిధర్ రెడ్డి, జనసేన సైనికులు చల్ల మద్దిలేటి స్వామి, నాగరాజు, శ్రీ కంటి మధు టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News