Wednesday, May 15, 2024
Homeపాలిటిక్స్Bibinagar: భువనగిరికి 100 కోట్లు ఇప్పిస్తా

Bibinagar: భువనగిరికి 100 కోట్లు ఇప్పిస్తా

20 ఏళ్లు అధికారంలో ఉంటాం

కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉంటే 500 కోట్లు ఖర్చు పెట్టి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మొత్తం సస్యశ్యామలం చేసేవారంటూ ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమీషన్ల మైకంలో పడి కాలేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే అభివృద్ధి చేశాడు దేశంలో మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదని కోమటిరెడ్డి భగ్గుమన్నారు.

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగానైతే గ్రామాలలో ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి కేసీఆర్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన మీరు ఇప్పుడు కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లి మోడీకి బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.

నాకు ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా ధర్మారెడ్డి పల్లి పిల్లాయిపల్లి బస్వాపూర్ ఆసిఫ్ నగర్ మూసీ నది ప్రక్షాళన ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎమ్మెల్యేల సహకారంతో కోమటిరెడ్డి బ్రదర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటూ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు రామాంజనేయ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ముఖ్య నాయకులు శ్యామ్, నరేందర్ రెడ్డి, వేణు గౌడ్ నియోజకవర్గం కోఆర్డినేటర్లు ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ ,మహిళా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News