Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Bihar: చావనైనా ఛస్తా ..కానీ..: బిహార్ సీఎం

Bihar: చావనైనా ఛస్తా ..కానీ..: బిహార్ సీఎం

“చావనైనా ఛస్తా కానీ మళ్లీ బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోనంటే పెట్టుకోనంటూ” తెగేసి చెప్పారు బిహార్ సీఎం నితీష్ కుమార్. చచ్చేవరకూ బీజేపీతో కలిసేదే లేదని నితీష్ స్పష్టంచేశారు. నితీష్ సొంత పార్టీ జేడీయూకు, లాలూ పార్టీ ఆర్జేడీకి మధ్య వివాదాలు తలెత్తాయని, ఈ నేపథ్యంలో మళ్లీ ఆర్జేడీకి గుడ్ బై కొట్టి..ఎన్డీఏలో చేరతారంటూ కామెంట్స్ ఊపందుకుంటున్న వేళ నితీష్ చేసిన కామెంట్స్ రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఓవైపు సొంత పార్టీ నేతలు, మరోవైపు కూటమిలోని ఆర్జేడీ నేతలు నితీష్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ..ఆయన బీజేపీతో గట్టి సంబంధాలు నెరుపుతున్నారనే ఆరోపణలు చేస్తున్న సమయంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీనే మోసం చేసిన నితీష్ తో మళ్లీ దోస్తీ గీస్తీ జాంతానై అంటూ అటు కమలం పార్టీ కూడా స్పష్టం చేసింది. ఇదంతా నాటకం.. లోపల ఇద్దరూ ఒకటే అంటూ మరో బిహార్ నేత, ప్రశాంత్ కిశోర్ పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటంతో బిహార్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News