Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్Chautuppal: బిఆర్ఎస్ ఇన్చార్జ్ పై కేటీఆర్ కు ఫిర్యాదు

Chautuppal: బిఆర్ఎస్ ఇన్చార్జ్ పై కేటీఆర్ కు ఫిర్యాదు

మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్వి నాయకులు

చౌటుప్పల్ మండల దామెరలో నలగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ మునుగోడు నియోజకవర్గం ఓటర్ల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

కేటీఆర్ తో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తీర్మానం చేస్తూ మునుగోడు నియోజకవర్గంలో విద్యార్థి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఇన్చార్జి గతంలో, ప్రస్తుతం కూడా తన సొంత క్యాడర్ ను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినారు. ఇంచార్జ్ తన సొంత క్యాడర్ అంత కూడా పార్టీకి మోసం చేసి ఇతర పార్టీలో జాయిన్ అయ్యారని కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. కనీసం ఇప్పుడైనా మునుగోడు నియోజకవర్గంలో క్రియాశీలకంగా కష్టపడే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు కేటీఆర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రాధాన్యతలు ఇవ్వలేని ఎడల బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నది రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మునుగోడు నియోజకవర్గంపై పునరాలోచన చేసి విద్యార్థి నాయకులకు, యువజన సంఘం నాయకులకు కష్టపడే కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చి పార్టీ బలోపేతం చేయాలని వినతిలో కోరారు.

వినతి పత్రం ఇచ్చిన వారిలో మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి ముటుకులోజు రాఘవ, నాయకులు బంగారు వెంకటేష్, చాపల రవిశంకర్, మది రెడ్డి సాయి, గంట పురుషోత్తం ,ఉదరి రాకేష్, గంగాదేవి గణేష్, ఏనుగుల మచేందర్, శమల చింటూ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News