Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్Hyd: సీడబ్ల్యూసీ భేటీకి హైదరాబాద్ చేరుకున్న ప్రముఖులు

Hyd: సీడబ్ల్యూసీ భేటీకి హైదరాబాద్ చేరుకున్న ప్రముఖులు

రెండు రోజులపాటు కీలక భేటీ

సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ కీలక నేతలంతా శనివారమే హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలను రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా రెండ్రోజుల పాటు హైదారాబాద్ లోనే ఉండనున్నారు. హోటల్ తాజ్ కృష్ణలో రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News