Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్KTR fire on Revanth Govt: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే..కేటీఆర్ హెచ్చరిక

KTR fire on Revanth Govt: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే..కేటీఆర్ హెచ్చరిక

పథకాల లబ్ధిదారులు, సామాజిక వర్గాలకు మేం అండ

పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేసే సహాసం చేయలేదన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బందు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల అమలును నిలిపివేసే కుట్రను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.

- Advertisement -

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో ఆర్థిక స్వావలంబనకు, అభివృద్ధికి నోచుకోలేని దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని తాము ప్రారంభించామన్నారు. దళితులను కేలం ఒటు బ్యాంకుగా చూసిన కాంగ్రెస్, ఎన్నికల సందర్భంగా దళిత బందును 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ , దాన్ని మరిచిపోయిందన్నారు. ఇప్పటకే ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దళిత బంధు కోసం లబ్ధిదారులు బ్యాంకుల్లో ప్రారంభించిన బ్యాంకు అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుందన్నారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గానికి మూడు వేల మందికి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో భాగంగా తమ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన ప్రొసీడింగ్స్ ని అందించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విధంగా పేదలు దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వారికి అండగా నిలుస్తామన్నారు.

కేవలం ఎన్నికల కోసం అడ్డగోలుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శ్వేత పత్రాలు, అప్పుల పేరుతో నాటకాలు ఆడుతుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సభసాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం 6 గ్యారెంటీ ల పేరుతో తప్పించుకోవడానికి చూస్తే ఊరుకునేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు.

గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి లైన్లలో నిలబెట్టకుండానే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను వారి ఇంటి ముందుకి తీసుకెళ్లి ఇచ్చిన పరిస్థితి ఉంటే, ఈ రోజు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి ప్రజలందరినీ లైన్లలో నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు కేటీఆర్. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్థవ్యస్ద పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలియజేశారు.

ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో హాజరైన నాయకులను పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News