Monday, May 20, 2024
Homeపాలిటిక్స్KTR in campaign: మల్కాజ్గిరి యూత్ మీటింగ్ లో కేటీఆర్

KTR in campaign: మల్కాజ్గిరి యూత్ మీటింగ్ లో కేటీఆర్

రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ లీడర్

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్, మల్కాజ్ గిరిలో యూత్ మీటింగ్ కు హాజరై ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

- Advertisement -

కేటీఆర్ కామెంట్స్

🔹పార్లమెంట్ ఎన్నికలు కదా? బీఆర్ఎస్ ఎందుకు ఉండాలే అని కొందరు అంటున్నారు.

🔹2001 లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పార్లమెంట్ లో మనకు బలం ఉండాలే అన్నారు.

🔹అప్పుడు కూడా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు అవహేళన చేసే విధంగా మాట్లాడారు.

🔹2004 లో మనం ఐదుగురు ఎంపీలు గెలిచినాం. ఆ ఐదుగురితోనే కేసీఆర్ ఢిల్లీకి పోయిండు.

🔹32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణను సాధించింది కేసీఆర్.

🔹కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ, మోడీ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారు.

🔹రాహుల్ గాంధీని, మోడీని ఎదురించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు.

🔹జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.

🔹స్కై వే కట్టటం కోసం పదేళ్లు మిలిటరీ భూములు ఇవ్వమంటే కంటోన్మెంట్ లో ఇయ్యలే.

🔹కేంద్రపాలిత ప్రాంతం అయితే మన జుట్టు తీసుకొనిపోయి ఢిల్లీ వాడి చేతిలో పెట్టినట్లయితది.

🔹కేంద్రపాలిత ప్రాంతమైతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది.

🔹ఈ కుట్రను అడ్డుకోవాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఉండాలె.

🔹ఢిల్లీలో ఉన్నది బీజేపీ ది సవతి తల్లి లాంటి వ్యవహారం. వాళ్లు మనకు అడగనిదే ఏదీ చేయరు.

🔹గల్లా పట్టి నిలదీసే ధైర్యం ఉండాలంటే మన కేసీఆర్ సైనికులు పార్లమెంట్ లో ఉండాలె.

🔹ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తోంది బీజేపీ.

🔹అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

🔹కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపోళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలకగా పడగొట్టారు.

🔹కానీ కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, స్టాలిన్, కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసి విఫలమైంది.

🔹గట్టి లీడర్లు ఉన్న చోట బీజేపీ ఆటలు సాగలేదు. కాంగ్రెస్ కు మాత్రం బీజేపీని అడ్డుకోవటం చేతకాలేదు.

🔹మోడీతో కొట్లాడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు. ప్రాంతీయ శక్తులే బలంగా మోడీతో కొట్లాడగలవు.

🔹కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు జనరేటర్లు, ఇన్వెర్టర్లు, క్యాండిల్ లైట్లు, టార్చిలైట్, పవర్ బ్యాంక్, ఛార్జింగ్ బల్బ్ లు.

🔹అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వస్తే ఈ పరిస్థితి ఉంటది ముందే చెప్పినం.

🔹మీరు కాంగ్రెస్ హామీలను నమ్మలేదు. కానీ జిల్లాల్లో, గ్రామాల్లో ప్రజలు ఆ పార్టీ నమ్మారు.

🔹కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా.

🔹మీరు 10-12 సీట్లు ఇవ్వండి. 6 నెలల్లోనే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.

🔹రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు. అరచేతిలో వైకుంఠం చూపించిండు.

🔹రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ. 2500, పెద్ద మనుషులకు 4 వేలు అని చెప్పిండు.

🔹చెప్పిదాంట్లో ఒక్కటైనా ఈ రేవంత్ రెడ్డి అమలు చేసిండా?

🔹5 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటంటే చిల్లర మాటలు, ఉద్దెర పనులు

🔹లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అంటాడు. లంకెబిందెల కోసం దొంగలు కదా వెతికేది?

🔹పేగులు మెడలు వేసుకుంట అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుంటా అంటాడు. సీఎం చేసే పనులేనా?

🔹మన తెలంగాణ పరిస్థితి పిచ్చోని చేతిలో రాయిలా తయారైంది.

🔹కరెంట్, నీళ్లు ఇచ్చుడు చేతనైతలేదు. కానీ విలన్లు చెప్పినట్టు డైలాగులు చెబుతుండు.

🔹హైదరాబాద్ లో ఉన్న కంపెనీలను కాపాడుకునే చేతనైతలే. ఇంకా కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితే లేదు.

🔹పరిపాలన చేతకాని వాళ్లకు అవకాశం ఇస్తే నష్టపోయేది మనమే.

🔹పదేళ్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి హైదరాబాద్ ఒక్క పనిచేసిన అని చెప్పగలడా?

🔹ఒక్క బడి కట్టలే, గుడి కట్టలే. ఎందుకు ఓటు వేయాలంటే జై శ్రీరామ్ అంటాడు.

🔹2014 లో ఏమన్నాడు. ఇంటింటికి రూ. 15 లక్షలు అన్నాడు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని చెప్పిండు.

🔹బుల్లెట్ రైళ్లు, ఇండియాను 5 టిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని కూడా అన్నాడు. ఒక్కటైనా అయ్యిందా?

🔹ఈ ప్రధాని మోడీ ధరలు కూడా తగ్గిస్తా అన్నాడు. కానీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిండు.

🔹పెట్రోల్ ధరలు, డిజీల్ ధరలు పెంచటం కారణంగా ఈ ధరలన్నీపెరిగాయి.

🔹మోడీ వచ్చిన నాడు ముడి చమురు వంద డాలర్లకు బ్యారెల్.

🔹ఇప్పుడు ముడి చమురు బ్యారెల్ కు 84 డాలర్లు.

🔹మరి తగ్గాల్సిన ధరలు ఎందుకు తగ్గలేదు. రూ. 70 పెట్రోల్ రూ. 110 అయ్యింది.

🔹పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు.

🔹ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడు.

🔹మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు.

🔹నేను చెప్పింది అబద్దమని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…రాజకీయాల నుంచి తప్పుకుంటా.

🔹భారత దేశంలో ఏం జరుగుతుందో మీ యువత తెలుసుకోవాలె.

🔹ఇండియాకు ఏదో జరుగుతుందని… హిందూమతమని, పాకిస్తాన్ అంటూ విద్వేషాలు పెంచి రాజకీయాలు చేయటమే బీజేపీ పని.

🔹పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే. విభజన హామీలు ఒక్కటి కూడా చేయలే.

🔹ఎందుకు మనం బీజేపీకి ఓటు వేయాలో ఆలోచించాలె. అడిగితే గుడి కట్టినం అంటారు.

🔹గుడిని మనం కూడా కట్టినం. కేసీఆర్ గారు యాదాద్రిని కట్టలేదా?

🔹కానీ మతం పేరుతో ఎప్పుడైనా రాజకీయాలు చేశారా?

🔹రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పాడు. పరిపాలకుడు ఎవరినైనా ఒకే విధంగా చూడాలి.

🔹కానీ హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయ్ ఇయ్యాడు మోడీ. అదే గుజరాత్ కు వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇస్తాడు. ఇదే నా రాజధర్మం?

🔹దయచేసి లాంగ్ వీకెండ్ ఉందని యువత ఓటు వేయకుండా ఉండొద్దు.

🔹మీరు ఓటు వేయకపోతే మీకు ఇష్టం లేని లంగ, దొంగ నాయకులు రాజ్యమేలుతారు.

🔹కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నాన్ లోకల్. రాగిడి లక్ష్మారెడ్డి గారు మాత్రం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News