ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కర్నూలు జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, ఇతర నేతలు పోరెడ్డి వేణుగోపాలరెడ్డి, తకియాసాహెబ్, వినయ్ కుమార్లు.
- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజాద్ బాషా, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.