Saturday, July 6, 2024
Homeపాలిటిక్స్KTR @ BRSV: రేవంత్ రెడ్డి కాదు 'రేటెంత రెడ్డి'?

KTR @ BRSV: రేవంత్ రెడ్డి కాదు ‘రేటెంత రెడ్డి’?

ఏం పీకడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి?

తొమిదిన్నర ఏళ్లలో తెలంగాణ ఎలా మారిందో చూడండి అంటూ కేటీఆర్ సగర్వంగా చెప్పారు. సోషల్ మీడియా గంటలు గంటలు చూస్తుంటారు, కానీ బీజేపీ సోషల్ మీడియాతో ఏదేదో ప్రచారం చేస్తుంటారని కేటీఆర్ మండిపడ్డారు. ఫేక్ న్యూస్ లని ప్రచారం చేస్తున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చేట్టు మీరు కూడా అదే సోషల్ మీడియా వాడుకొని వాస్తవాలు ప్రచారం చేయాలి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ లను విస్తృతంగా వాడండి అని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

కేసిఆర్ ఏం చేసిండు కేసిఆర్ అని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టేలా గ్రామగ్రామాన జరిగిన అభివృద్ధిని చూపించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 10 యేళ్లు ఉన్న పిల్లలకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని, వాళ్ళకి 2014 ముందు పరిస్థితులు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలియజెప్పాలన్నారు కేటీఆర్.

రాజకీయ యుద్ధంలో మనతో పోటీ పడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ సమయంలో యువత, విద్యార్థులను చంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వందల మంది చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీను నమ్మకండి అన్నారు. పేపర్ లీకేజీ చేసింది బండి సంజయ్ చెంచాగాడు కాదా? గ్రూప్ 2 రద్దు చేయాలని చెప్పింది బండి సంజయ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కాదా? రద్దు చేస్తే గొడవ చేసింది వీళ్ళు కాదా? కోర్టులో కేసు వేసి గ్రూప్ 2 రద్దు చేయించారని కేటీఆర్ మండిపడ్డారు.

వాళ్లంతా కడుపులో గుద్ది, నోట్లో పిప్పరమెంటు పెడుతారని కేటీఆర్ హెచ్చరించారు. TSPSC పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని, డిసెంబర్ 3 తర్వాత TSPSC ప్రక్షాళన చేయటానికి నేనే బాధ్యత తీసుకుంటానని, కొన్నిచోట్ల తప్పులు జరిగాయని నేనే ఒప్పుకుంటాను అని కేటీఆర్ ప్రకటించటం విశేషం. అక్కడి రా ఇక్కడి రా అని సవాల్ చేస్తున్నారు మేము ఎక్కడికైనా వస్తామని, కానీ మీలాంటి పందుల దగ్గరికి రామని తెగేసి చెప్పారు.

ఎవరెవడో వచ్చి డైలాగులు కొడితే పడిపోకండని, ఉద్యమ విద్యార్థి నాయకులకి పదవులు ఇచ్చింది కేసిఆరేనన్నారు ఆయన. ఊదర గొట్టే ఉపన్యాసాలు చేసే వారిని తిప్పి కొట్టాలన్నారు. 33 జిల్లాల్లో రాష్ట్ర కమిటీ ఉన్నదని, రాబోయే 30 రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకులు మనం చేసిన అభివృద్ధి గురించి చర్చ పెట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారని, BRSV విద్యార్థి సంఘాల నాయకులు వాటిని తిప్పి కొట్టాలన్నారు.

పార్లమెంట్ లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని, నిండు పార్లమెంట్ లో ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడుతున్నారన్నారు. మొన్న అమిత్ షా వచ్చి ముఖ్యమంత్రి అని ముసలి కన్నీరు కారుస్తున్నారు, ఒకడు కులం అంటాడు, మరొకడు మతం అంటాడు. కులం, మతం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా ఆలోచించాలన్నారు. 3,1046 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చింది కేసీఆరేనని.. సంపద పెంచింది కేసీఆర్ అని.. మనతో పోటీ పడుతున్నది ఇద్దరు చిల్లర గాళ్లన్నారు.

మనకి పోటీ కాంగ్రెస్ , బిజెపి కాంగ్రెస్ పార్టీకీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓటుకి నోటు దొంగ గాడు , వాడు అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మద్యం పంచకుండా ప్రమాణం చేద్దామంటున్నాడన్నారు. వాడు పచ్చిగా దొరికిన దొంగ, వాడు నీతులు చెప్తోండంటూ మండిపడ్డారు.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడుతున్నారని, ఏం పీకడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డిని ఇప్పుడు ‘రేటెంత రెడ్డీ’ అంటున్నారని ఎద్దేవా చేశారు. వాడికి అధికారం ఇస్తే కోటిలో చారానకి అమ్మేస్తాడని హెచ్చరించారు. అందుకే వాళ్ళని నమ్మొద్దు మోస పోవద్దన్నారు.

ఎన్నో పోరాటాలతో రాష్ట్రం వచ్చిందని, అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మోసపోవద్దన్నారు. డికే శివ కుమార్ పైసలు పట్టుకొని వచ్చాడని, డికే వచ్చి పీకేదేం లేదన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి, 5 గంటలు ఇస్తున్నామని చెప్తున్నాడు.. నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News