Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Shadnagar: కాంగ్రెస్ ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు

Shadnagar: కాంగ్రెస్ ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు

ఈశాన్యం మూల సిద్దపుర్ గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం

విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఎల్లారం శేఖర్ రెడ్డి తో కలిసి మండల పరిధిలోని ఈశాన్య మూల అయిన సిద్దాపూర్ గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచార రథాలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈసారి షాద్నగర్ గడ్డపై కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, బిఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడుదామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమను ఆశీర్వదించాలని నాయకులు కోరారు. గత తొమ్మిది సంవత్సరాలుగా పడుతున్నటువంటి అవస్థలను తొలగించే సందర్భం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ గెలుపుకోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ,కాంగ్రెస్ అభ్యర్దిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిరభించరు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధయక్షుడు గొంగల్ల హరినాథ్ రెడ్డి ఫరూక్నగర్ జెడ్పిటిసి వెంకట్రంరెడ్డి, ఎస్పీ పల్లి సర్పంచ్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండ్ర శ్రావణ్ రెడ్డి, వసుపుల మహేందర్, పాశం కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ జంగయ్య, జి మల్లేష్, రవీందర్ రెడ్డి, షరీఫ్, మహేందర్ రెడ్డి, మైసయ్య, తిరుపతిరెడ్డి, యాదయ్య, లింగం, కాజా, భూపాల్ రెడ్డి, పాష, వడ్డె వెంకటయ్య, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News