Sunday, May 12, 2024
HomeఆటAswaraopeta: ఐపీఎల్ సీజన్ లో యువత దివాలా

Aswaraopeta: ఐపీఎల్ సీజన్ లో యువత దివాలా

హోటళ్ళు, జ్యూస్ సెంటర్లే బెట్టింగ్ రాయుళ్ల అడ్డా

అశ్వరావుపేట నియోజకవర్గంలో ఐపీల్ సీజన్ వచ్చిందంటే చాలు జోరుగా బెట్టింగ్ లు క్షణాల్లో చేతులు మారుతున్న లక్షల రూపాయలు. చిత్తు చిత్తు అవుతున్న యువతను కండ్లప్పగించి చూస్తున్న సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు యువత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో బెట్టింగులకి అలవాటు పడి, ఆర్ధికంగా చాలా నష్టపోతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో భారీగా బెట్టింగులకి పాల్పడుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు 6 గంటల నుంచి రాత్రి 11 అయ్యే వరకి అడ్డాలుగా మారిన వివిధ షాపులలో గుంపులుగా కూర్చొని టేబుల్ బ్యాచులు టీమ్ లుగా కూర్చొని ధావత్ లు చేసుకుంటూ.. కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్లు హల్ చల్ చేస్తున్నారు.

- Advertisement -

బెట్టింగుల ఉచ్చులో పడి యువత భారీగా నష్టపోతూన్నారు. రోజువారీ పొద్దంతా కష్టపడి సంపాదించుకొని సాయంత్రం అయిందంటే చాలు బెట్టింగు ఉచ్చులో పడి నష్టపోతున్నారు. ఫోన్లోనే టీమ్ ల వారీగా నువ్వెంత అంటే నేను ఇంతా అని మొదలుపెడతారు. ఈ బెట్టింగులు ఎలా అంటే రెండు టీమ్ లలో టాస్ తో మొదలై ఏ టీం గెలుస్తుంది అనే వరకు పందెం కాస్తున్నారు. అంతేకాకుండా బంతి బంతికి బెట్టింగ్ ఆటగాళ్ల మీద కూడా పందెం నడుస్తుంది. ధోని, కోహ్లీ క్రేజీ ఉన్న ప్రతి ప్లేయర్ పై ఈ బెట్టింగులు సుమారు 1000 నుంచి మొదలుకొని ఒక్కొవ్యక్తి 50,000 వరకి మ్యాచ్ తీరుని బట్టి బెట్టింగు పెడుతున్నట్లు వినికిడి. కొంతమంది యువకులు ఆఫ్ లైన్లో, ఆన్లైన్లో బెట్టింగ్ వ్యవసనానికి మరిగి నష్టపోతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువత మానసికంగా కుంగిపోయి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. మ్యాచ్ లు ఓడిపోయిన వారు అప్పులు తీసుకొని, మరికొందరు అయితే బంగారం, బైక్ లు సైతం కుదవ పెడుతూ రోడ్డున పడుతున్నారు.

ముఖ్యంగా విచ్చలవిడిగా సాగుతున్న ఈ బెట్టింగుల వ్యవహారం అశ్వరావుపేట సర్కిల్లలోనే అడ్డాలుగా ఏర్పర్చుకొని కొన్ని చుట్టూ పక్క ప్రాంతాలలో బెట్టింగులకి పాల్పడుతుండటంతో నిఘా లోపమా అనేది గమనార్హం. అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడే వాళ్ళతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అడ్డాలని ఆసరాగా వాడుకొని సంబంధించిన అధికారులే చూసీ చూడనట్లు ఇలా వ్యవరిస్తున్నారా? అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొంతమంది యువకులు మామూళ్ల రాయుళ్లు మాతో ఉన్నంత వరికి మాలాంటి పందెం రాయుళ్ళని అడిగేది ఎవరు అంటూ విచ్చలవిడిగా బెట్టింగులు నడిపిస్తున్నారు.

ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో నెలసరి మామూళ్లకి అలవాటు పడిన వారు ఇలాంటివి చూసీ చూడనట్లు ఉంటున్నారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల నిఘా పెట్టాలని ప్రజలు వాపోతున్నారు. పట్టణాలకే పరిమితం అని కాకుండా పల్లెల్లో కూడా ఈ బెట్టింగ్ దందా నడుస్తుంది కాబట్టీ బెట్టింగులు చేస్తూ యువత రోడ్డున పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో యువత తల్లిదండ్రులు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News