Sunday, October 6, 2024
HomeఆటShadnagar: యువత క్రీడా స్ఫూర్తిని చాటి, ఉన్నతంగా ఎదగాలి

Shadnagar: యువత క్రీడా స్ఫూర్తిని చాటి, ఉన్నతంగా ఎదగాలి

మ్మెల్యే అంజయ్య యాదవ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

యువతీ యువకులు క్రీడల్లో పాల్గొనేటప్పుడు క్రీడా స్ఫూర్తిని చాటాలని, తద్వారా జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని డిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వై మురళి యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో మొత్తం 120 టీములు పాల్గొనగా కొందుర్గు టీం మొదటి విజేతగా, రన్నరు విజేతగా చించొడ్ టీం విజయాన్ని సాధించారు. క్రికెట్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ చాటిన గెలుపొందిన వారికి బిఆర్ఎస్ నాయకుడు మురళి చేతుల మీదుగా విన్నర్స్ కు అవార్డులను అందజేశారు. ఈ సంధర్బంగా పలువురు మాట్లాడుతూ….యువత క్రీడారంగాలలో రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాలని , దానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని క్రీడాకారులకు సూచించారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం పెంపొందుతుందనీ సూచించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా రాష్ట్రస్థాయిలో పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చేర్మెన్ నటరాజన్, కొందుర్గు మండల వైస్ ఎంపిపి రాజేష్ పటేల్ మున్సిపల్ కౌన్సిలర్లు, జూపల్లి శంకర్, కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News