Wednesday, June 25, 2025
HomeTS జిల్లా వార్తలుIAS Amrapali: ఆమ్రపాలి బ్యాక్ టూ తెలంగాణ

IAS Amrapali: ఆమ్రపాలి బ్యాక్ టూ తెలంగాణ

IAS Amrapali: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఏడాది క్రితం కేంద్రం ఆదేశించింది. తమను తెలంగాణకే కేటాయించాలన్న పలువురి అభ్యంతరాలనూ తోసిపుచ్చింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధులు నిర్వర్తించారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. క్యాట్ నిర్ణయంతో తిరిగి ఆమె తెలంగాణలో విధులు చేపట్టనున్నారు.


కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌) అధికారిణి. ఆమె “యువ డైనమిక్ ఆఫీసర్”గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ ఐఏఎస్‌ అధికారిణి. ఆమ్రపాలి ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సీఈవోగా బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పని చేసి ఆ తర్వాత 2020 నుంచి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/trisha-intresting-comments-love-news-goes-viral/

ఆమ్రపాలి 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణకు వచ్చి 2023 డిసెంబర్ 14న హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్‌గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా పనిచేశారు. 2024 జూన్ 24న ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలి కాటాను 2024 అక్టోబరు 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) వైస్ చైర్మన్, ఎండీగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి తండ్రి విశ్రాంత ప్రొఫెసర్. ఈమె పాఠశాల విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్‌లో జరిగింది. తర్వాత ఆమె చెన్నైలోని ఐఐటి మద్రాస్ నుంచి ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైంది. IIM బెంగుళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్‌ను సాధించి, ఐఏఎస్‌కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఆమ్రపాలి ఒకరు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/huge-plan-for-jr-ntr-and-prashanth-neel-movie-interval-sequence/

ముస్సోరిలో శిక్షణ అనంతరం వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తరువాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్‌లో పనిచేశారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పించింది. తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News