Monday, May 20, 2024
HomeతెలంగాణChevella: కాసాని గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Chevella: కాసాని గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ కు కంచుకోట దేవరంపల్లి

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల మండలం దేవరపల్లిలో గ్రామ మాజీ సర్పంచ్ బచ్చం గారి నరహరి రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దొళ్ల ప్రభాకర్ అధ్యక్షతన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ కనీస వేతనాల సహకార సంఘం చైర్మన్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నరహరి రెడ్డి మాట్లాడుతూ… ప్రచారంలో గ్రామస్తులకు కేసీఆర్ 10 సంవత్సరాలు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. వంద రోజుల గడువు చెప్పి అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందారున్నారు. మరోసారి వాయిదాల పేరు చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అధికార దాహంతో పార్టీ మారిన అవకాశవాది అన్నారు. కేవలం పదవి కోసమే పార్టీ మారిన రంజిత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి ఎలా పాటు పడతారని ప్రశ్నించారు. కుల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపి పార్టీతో దేశానికే ప్రమాదం అన్నారు. ఆ పార్టీ నాయకులకు ఓట్లు వేస్తే రిజర్వేషన్ ఉండదని పేదలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులు కోల్పోతామన్నారు. 15 సంవత్సరాల అనంతరం ఒక బీసీ బిడ్డకు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కిందన్నారు. బీసీలు అందరూ కాసానిని గెలిపించి పార్లమెంట్ కు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. బిసిల తరుపున కాసాని గొంతు పార్లమెంట్లో వినిపిస్తారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ శివారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి దండు సత్తి వెంకటేశ్ బేగరి నర్సింలు ఎర్రోళ్ల మహేందర్ హస్టేపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య బుర్ల మహేష్ సీనియర్ నాయకులు ఎల్లన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News