Monday, May 20, 2024
HomeతెలంగాణChevella: బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి

Chevella: బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా నరేందర్ రెడ్డి

కాసాని గెలుపు కోసం ..

బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా సామ నరేందర్ రెడ్డిని నియమించారు. చేవెళ్ల మండల కేంద్రంలోని బర్కల రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో చేవెళ్ల మండల బిఆర్ఎస్ నాయకులు సమావేశమైయ్యరు. ఈ కార్యక్రమం అనంతరం అల్లవాడ గ్రామానికి చెందిన సామ నరేందర్ రెడ్డిని మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ మాజీ ఎంపీపీ మంగలి బాలరాజ్, మాజీ కనీస వేతనాల సంఘం చైర్మన్ నారాయణ చేతుల మీదుగా నిమమాక పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపు కోసం గ్రామాలలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… తనపై నమ్మకంతో మండల ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఎమ్మెల్యే యాదయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికకు సహకరించిన బిఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి పార్టీ తలపెట్టిన కార్యక్రమంలో తన వంతు కర్తవ్యాన్ని అందరితో కలిసి నిర్వహిస్తానన్నారు. పార్టీ గెలుపు కోసం పార్టీ బలోపేతం కోసం బిఆర్ఎస్ నాయకులతో కలిసి కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో ఉరడి నరసింహులు, కసిరే వెంకటేష్, దండు సత్యం, ఎదిరే రాములు, కుమార్, కృష్ణ, రాఘవేందర్ రెడ్డి, తోట చంద్రశేఖర్, ఎర్రోళ్ల మహేందర్, రాంప్రసాద్ మహేష్, వెంకటేష్ బిఆర్ఎస్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News