Tuesday, September 17, 2024
HomeతెలంగాణHyd: కిషన్ రెడ్డి అంబర్ పేటకు ఏం చేశారు?

Hyd: కిషన్ రెడ్డి అంబర్ పేటకు ఏం చేశారు?

ధరలను పెంచి పేద, మద్య తరగతి ప్రజలపై మోయలేని భారం మోపిన పాపం కేంద్రంలోని BJP ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్ నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ BRS పార్టీ ఆత్మీయ సమావేశం క్రౌన్ ఫంక్షన్ హాల్ లో MLA కాలేరు వెంకటేష్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ముందుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మహిళలు బోనాలతో, పోతురాజుల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. BJP పార్టీ నుండి BRS పార్టీలో చేరిన పలువురికి మంత్రి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ UPA ప్రభుత్వ హయాంలో 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధర BJP అధికారంలోకి వచ్చిన తర్వాత 1100 రూపాయలకు పైగా పెరిగిందని విమర్శించారు. నాడు 400 రూపాయలు ఉంటేనే గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి ఓటేయాలని చెప్పిన ప్రధాని మోడీ 1100 రూపాయలకు పైగా గ్యాస్ ధర ఉందని, ఇప్పుడు ఎవరికీ దండం పెట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మద్య తరగతి ప్రజలపై ఆర్ధికంగా ఎంతో పెనుభారం పడిందని అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల కోట్ల రూపాయల ఖర్చుతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలు అనేకం పరిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.

అంబర్ పేట కు 15 సంవత్సరాలు MLA గా ఉండి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 4 సంవత్సరాల నుండి కేంద్రమంత్రిగా ఉండి తనను ఓట్లేసి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకోసం డిల్లీ నుండి ఎన్ని నిధులు తీసుకోచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా ఉన్నాడంటే అది అంబర్ పేట నియోజకవర్గ ప్రజల చలువేనని పేర్కొన్నారు. MLA గా ఓడినందు వల్లనే MP గా గెలిచి కేంద్రమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుచేశారు. కాలేరు వెంకటేష్ MLA గా గెలిచిన తర్వాతనే అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్ వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రజల సమస్యలను అనేకం పరిష్కారం అయ్యాయన్న విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News