Monday, May 13, 2024
HomeతెలంగాణHyd: ఇంటర్ ఫస్ట్ ర్యాంకర్ మణిదీపికకు మంత్రి అభినందన

Hyd: ఇంటర్ ఫస్ట్ ర్యాంకర్ మణిదీపికకు మంత్రి అభినందన

ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి సంవత్సరం పరీక్షల్లో రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మణిదీపికను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. నిన్న (09.05.2023) విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి సంవత్సరం ఫలితాలలో (470 మార్కులకు గాను 468 మార్కులు) రాష్ట్రంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన తోక మణిదీపికను ఆయన ప్రత్యేకంగా సచివాలయానికి పిలిపించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదివి సమాజాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం అధ్యక్షులు కూరెళ్ల వేములయ్య గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు కొండ నలిని గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్ గౌడ్, తల్లిదండ్రులు తోక ఫణిరాజ్ గౌడ్, సుభాషిని, కీసర మల్లేష్ గౌడ్, కార్తికేయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News