Sunday, September 8, 2024
HomeతెలంగాణYacharam: ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అవకాశం కోసం..

Yacharam: ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అవకాశం కోసం..

కష్టపడ్డ వారికే పట్టం-మల్ రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలో ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొని పనిచేస్తున్న తమకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఛాన్స్ ఇవ్వాలంటూ ముచ్చర్ల సంపత్ కుమార్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి కోసం, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కష్టపడుతూ, ఒకే పార్టీని, ఒకే నాయకుడిని నమ్ముకుని పార్టీకి తన సాయశక్తులా సేవలందిస్తూ కృషి చేసానని, తను చేసిన సేవలను పార్టీ గుర్తించి తనకు తగిన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తంచేసారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీ రిజర్వుడు అయినందున చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నానని, కచ్చితంగా చైర్మన్ పదవి సంపత్ కుమార్ కి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి కచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తూ, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్లకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డిరంగారెడ్డి హామీ ఇచ్చారని ముచ్చర్ల సంపత్ తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో యాచారం మండలం వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల వెంకట్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్, అరవింద నాయక్ ఎంపీటీసీ, లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్, దెంది మధుకర్ రెడ్డి, అఖిల్ ఖాన్, కొండల్, బాలరాజ్, జమ్మ గుండాలు, తాండ్ర మహేష్, గణేష్ వన్నాడపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News