Friday, September 20, 2024
HomeతెలంగాణIbrahimpatnam: గైఖాoగంమ్ గాంగ్మీని మర్యాద పూర్వకంగా కలిసిన నిరంజన్ రెడ్డి

Ibrahimpatnam: గైఖాoగంమ్ గాంగ్మీని మర్యాద పూర్వకంగా కలిసిన నిరంజన్ రెడ్డి

తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరిన నిరంజన్ రెడ్డి

ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జిగా మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 7సార్లు ఎమ్మెల్యే గా, 2 సార్లు సిడబ్ల్యూసి మెంబర్ గా, మణిపూర్ మాజీ పీసీసీ అధ్యక్షులుగా, మాజీ హోం శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా సేవలందించిన గైఖాoగంమ్ గాంగ్మీని నియమించారు. టిపిసిసి సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గత 22 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న నన్ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. గంటకు పైగా జరిగిన సుదీర్ఘ చర్చలో వివిధ అంశాలపై చర్చించారు. ఏఐసిసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం యువతకు అవకాశం కల్పించాలన్నారు. చర్చల అనంతరం సానుకూలంగా స్పందించిన గైఖాoగమ్ గాంగ్మీ యువతకు ప్రాధాన్యతలో తను ముందు ఉంటానని యువతకు అవకాశాల గురించి పరిశీలిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News