Friday, October 18, 2024
HomeతెలంగాణHuzurabad: ఓటేసిన ఈటల

Huzurabad: ఓటేసిన ఈటల

ఓటేసిన ఈటల దంపతులు

ఈటల రాజేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని సెంట్రల్ ప్రైమరీ స్కూల్ లో ఓటుహక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్, జమున దంపతులు.

- Advertisement -

స్వేచ్ఛ, సుపరిపాలన కోసం అణచివేత, దౌర్జన్యంకు వ్యతిరేకంగా ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగకుండా ప్రజలు ఓట్లు వేస్తున్నారని, అందుకోసం నేను వినమ్రంగా వేడుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని బిజెపి హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో గురువారం తన భార్య జమునా రెడ్డితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ…
అర్ధరాత్రి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ లో చిల్లర ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్ లో తుదకంటా పోరాటం చేస్తుంటే.. చేతులెత్తేసిన అని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఏం చేసినా ఈటల రాజేందర్ ను గజ్వేల్ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారని అన్నారు.
ఎన్నిసార్లు ఓటు వేస్తారు అని చిల్లర ప్రచారం చేస్తున్నారట..ఎన్నిసార్లు ఓటు వేసినా గౌరవం పెంచిన. మా ఎమ్మెల్యే అని చెప్పుకొనేలా పనిచేశానని అన్నారు. హుజూరాబాద్ లో రెండు పార్టీలకు భవిష్యత్తు లేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న కుట్రలు, దౌర్జన్యాలకు  ప్రతిఫలం ప్రజలు ఇస్తున్నారని, అధికారం, అహంకారం ను ఎదిరించే ఆయుధం ఓటుతో బుద్దిచెప్తున్నారని, దమననీతి, దౌర్జన్యంకు చెంప చెళ్లుమనిపిస్తున్నారని అన్నారు. గజ్వేల్ లో ఏ ఇంటికి ఆ ఇల్లు, ఎవరికి వారు కథానాయికులై  ఈటలను గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News