Friday, September 20, 2024
HomeతెలంగాణIllanthakunta: ప్రజలను చైతన్య పరచడంలో తెలుగుప్రభ దినపత్రిక

Illanthakunta: ప్రజలను చైతన్య పరచడంలో తెలుగుప్రభ దినపత్రిక

ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తున్న తెలుగుప్రభ

అనతి కాలంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన తెలుగు ప్రభ దినపత్రిక ప్రజలను చైతన్య పరచడంలో ముందు వరుసలో ఉంటుందని ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అన్నారు. తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యం రూపొందించిన 2024 క్యాలెండర్ ను ఎంపీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పావని వెంకటేష్ మాట్లాడుతూ… తెలుగు ప్రభ దినపత్రిక నిజాలను నిర్భయంగా ప్రచురించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజలను చైతన్య పరిచేందుకు పత్రికలు అనునిత్యం పని చేస్తుంటాయని అన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యాన్ని, రిపోర్టర్ల బృందాన్ని అభినందించారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోటపోతుల అయిలయ్య మాట్లాడుతూ… ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో పోటీతత్వం కలిగి ఉండాలని అన్నారు. ప్రజా సమస్యలను తమ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్న తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలుగు ప్రభ దినపత్రిక హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండపాక అశోక్ గౌడ్, సీతంపేట ఎంపీటీసీ సభ్యుడు తెడ్ల ఓదెలు, ఖుషి, హరీష్ , విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News