Friday, September 20, 2024
HomeతెలంగాణKalvakurthi: ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవు

Kalvakurthi: ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవు

ప్రతిపక్షాలను మట్టి కరిపించాలని జైపాల్ పిలుపు

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవని కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్కా జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని స్టేడియం మైదానం సమీపంలో ఈ నెల 19 నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జైపాల్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ లక్ష్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వాల పట్ల విసిగి వేసారి పోయిన ప్రజలు కాంగ్రెస్, బిజెపిలను వీడి స్వచ్ఛందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ఎడ్మసత్యం, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శ్రీశైలం, కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News