తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరను సజావుగా నిర్వహించడంలో భాగంగా పర్యాటక-సమాచార శాఖ, వివిధ న్యూస్ చానెళ్ళు ఏకంగా ఏడు భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్లను ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు.
3 భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్ల ద్వారా మేడారం మహా జాతర విశిష్టతను గురించి వివిధ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్ లో ప్రసారమయ్యే వార్తలు, జాతర విశేషాలను ఎప్పటికప్పుడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శిస్తున్నారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/960eca82-a72a-4f60-8dcf-f497739bb25f-1024x682.jpg)
మరో 4 ఎల్.ఈ.డీ స్క్రీన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆదివాసి గిరిజనుల జీవన విధానం, మేడారం మహా జాతర విశిష్టతను, వినోదాత్మక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తూ భక్తులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తున్నాయి.