Tuesday, September 17, 2024
HomeతెలంగాణJadcharla: నాపై వస్తున్న అసత్య ఆరోపణలు అవాస్తవం

Jadcharla: నాపై వస్తున్న అసత్య ఆరోపణలు అవాస్తవం

అవినీతి అనే పదం నా ఒంట్లో లేదు

నాపై వస్తున్న అసత్య ఆరోపణలు అవాస్తవమని, అవినీతి అనే పదం నా ఒంట్లో లేదని బాదేపల్లి పీఏసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ అన్నారు. బాదేపల్లి పిఎసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నాబార్డు రుణంతో గోదాం నిర్మాణం విషయంలో అవినీతి జరిగినట్లు కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని అన్నారు. గోదాం నిర్మించాక నాబార్డ్ అధికారులు ఆడిట్ చేశాక ఎంబి లెక్కల ప్రకారం నిర్మించిన గోదాం పనులకు నాబార్డ్ రుణం ఇచ్చారని, అలాంటి నాబార్డు రుణం దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని, నిరూపిస్తే వాటికి తానే స్వయంగా బాధ్యత వహిస్తానని అన్నారు.

- Advertisement -

చట్ట ప్రకారం చర్యలు..

అసత్య ఆరోపణలకు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. అలాగే పిఎసిఎస్ సీఈవో యాదగిరిపై ఫర్టిలైజర్ పంపిణీలో రూ. మూడు లక్షల 37 వేల రూపాయల అవినీతి ఆరోపణ నేపథ్యంలో విచారణ నిమిత్తం మంగళవారం జరిగిన పిఎసిఎస్ పాలకమండలి సమావేశంలో యాదగిరి ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News