Sunday, July 7, 2024
HomeతెలంగాణJadcharla: అమరవీరులకు నివాళులు

Jadcharla: అమరవీరులకు నివాళులు

మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరుల త్యాగం మరువలేనిదని జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగం వృధా కాలేదని, ఉద్యమ నేత, మాజీ సీఎం కెసిఆర్ అమరవీరుల ఆకాంక్షల అనుగుణంగా పాలన సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్ని వర్గాలకు సమచిత స్థానం కల్పిస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చారని అన్నారు. కార్యక్రమంలో జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News