Tuesday, September 17, 2024
HomeతెలంగాణJanagama: BRSకు తిరుగులేదు

Janagama: BRSకు తిరుగులేదు

జనగామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం దేవరుప్పుల మండలం సీతారపురం, ధర్మపురం బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశానికి కావల్సింది గుజరాత్ మోడల్ కాదు…అది ఫెయిల్ అయిందంటూ ఎర్రబెల్లి నిప్పులు చెరిగారు. తెలంగాణ మోడల్ దేశ వ్యాప్తం కావాలని, అతి తక్కువ కాలంలో తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందుందటమే ఇందుకు నిదర్శనమన్నారు. బిఅర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సీతారపురం, చిప్పరాళ్ల బండ తండా, పొట్టిగుట్ట తండా, ధర్మగడ్డ తండా, గ్రామాలు కలిపి సీతారపురం స్టేజి వద్ద, సీత్యతండా, లకావత్ తండా, లక్ష్మణ్ తండా, పడమటి తండా [డీ] కలిపి ధర్మపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

మ‌హిళ‌ల‌కు వ‌డ్డిస్తూ, వారితో క‌లిసి ఆత్మీయ భోజ‌నాలు
బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో బాగంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌యంగా వ‌డ్డించారు. మ‌హిళ‌ల‌తో క‌లిసి భోజ‌నాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బి అర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News