Monday, May 20, 2024
HomeతెలంగాణJanagama: పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

Janagama: పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

జోరందుకున్న ఎర్రబెల్లి ప్రచారం

పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం జోరందుకున్నది. ప్రచారంలో భాగంగా దేవరుప్పుల మండలంలోని చౌడుర్, సింగరాజు పల్లి, కడవెండి, నిర్మల, కామారెడ్డి గూడెం, దేవరుప్పుల గ్రామాల ఎంపీటీసీ పరిధుల్లోని గ్రామాల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కొరకు ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు ఎర్రబెల్లి.

- Advertisement -

ఈ సందర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, రాబోయే కాలం బిఆర్ఎస్ పార్టీదే అని, బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలు నెరవేర్చక కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఎన్నికల సాకుతో కొత్త నాటకం ఆడున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.మారేపల్లి సుధీర్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, జిల్లా బిఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి, ఎంపిపి బస్వ సావిత్రి మల్లేశం, పిఏసిఎస్ చైర్మెన్ లింగాల రమేష్ రెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News