Sunday, July 7, 2024
HomeతెలంగాణKale Yadayya: చిరు వ్యాపారుల నెత్తిన గొడుగైన ఎంపి

Kale Yadayya: చిరు వ్యాపారుల నెత్తిన గొడుగైన ఎంపి

చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి సహకారంతో పండ్లు కూరగాయలు చాయ్ అమ్ముకునే చిరు వ్యాపారులకు నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రం కావడంతో చిరు వ్యాపారులు ఎండలు తట్టుకోలేక పోతున్నారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి మంచి మనసు మానవతా దృక్పథంతో గొడుగులు స్పాన్సర్ చేశారన్నారు. చిరు వ్యాపారులు వ్యాపారాలు లేక మండుటెండల్లో విలవిలలాడుతున్నరని వారికి ఈ చిరు కానుక అందించారన్నారు. వారికీ నీడనివ్వాలనే ఉద్దేశంతో ఉచితంగా గొడుగుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ చిన్న గొడుగు వారికి ఎండ నుంచి ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మండల జనరల్ సెక్రెటరీ నరేందర్ గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రవీందర్, వ్యాపారస్తులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News