Sunday, October 6, 2024
HomeతెలంగాణKandala nomination: నామినేషన్ దాఖలు చేసిన కందాల ఉపేందర్

Kandala nomination: నామినేషన్ దాఖలు చేసిన కందాల ఉపేందర్

మేం రైతు బిడ్డలం, మాకే మీ ఓటు

పాలేరులో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

- Advertisement -


ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. కెసిఆర్ పెద్ద ఎత్తున చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలే పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని చెప్పారు. దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధిని సాధించిన తెలంగాణ మోడల్ ను మిగతా రాష్ట్రాలు అవలంభిస్తున్నాయని అన్నారు. పదేళ్ళలో తెలంగాణా దేశంలోనే ఎనలేని అభివృద్ధిని సాధించిందని చెప్పారు. తాను, ఉపేందర్ రెడ్డి రైతు బిడ్డలమని, స్థానికంగా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు, ఇక్కడే పుట్టి, పెరిగి ఇక్కడే తుది శ్వాశ వరకు ఉంటామని, ఉపేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నామ నాగేశ్వరరావు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News