Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: కలెక్టరేట్ ఎదుట రెడ్డి జెఏసి ఆధ్వర్యంలో నిరసన

Karimnagar: కలెక్టరేట్ ఎదుట రెడ్డి జెఏసి ఆధ్వర్యంలో నిరసన

గత శాసనసభ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసిఆర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారనీ అయిదు సంవత్సరాలయినా ఏర్పాటుచేయడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రెడ్డి జెఏసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాలల్లో పేదలు ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం మాట ఇచ్చి అయిదు సంవత్సరాలయినా కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారని అన్నారు. వెంటనే ఏర్పాటు చేయకపోతే రెడ్డిల సత్తాఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం ఇరవై అయిదు వేలు నష్ట పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెఏసి రాష్ట్ర నాయకులు పెండ్యాల రాంరెడ్డి, కూర మహిపాల్ రెడ్డి, చాడ రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, ఆర్ బివిఆర్ జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, పెండ్యాల కేశవ రెడ్డి, దన్యాకుల శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News