Sunday, June 30, 2024
HomeతెలంగాణKarimnagar: ఎంపీడీవో ఇష్టరాజ్యమా?

Karimnagar: ఎంపీడీవో ఇష్టరాజ్యమా?

కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించగా ముందుగా సమావేశానికి హాజరైన జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు శుక్రుద్దీన్ ను వేదిక పైకి ఆహ్వానించారు. సమావేశం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే సత్యం హాజరు కావడంతో అప్పటివరకు వేదిక మీద ఉన్న శుక్రుద్దీన్ ను కిందికి దించడంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. సమావేశం ప్రారంభంలో వేదికపై ఆహ్వానించి మధ్యలో వేదిక నుండి కిందికి దింపడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేదిక పైన ప్రోటోకాల్ లేదని అధికారులు భావించినప్పుడు ముందుగానే తనకు సమాచారం ఇస్తే సరిపోయేది కదా మధ్యలో అవమానించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News