Friday, September 20, 2024
HomeతెలంగాణKCR: దివ్యాంగుల పెన్షన్ 4,016 కు పెంచుతూ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్

KCR: దివ్యాంగుల పెన్షన్ 4,016 కు పెంచుతూ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్

ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసిఆర్

దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ గారు, సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

- Advertisement -

దివ్యాంగుల కు ఫించన్ పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని సచివాలయంలో కలిసి కృతజ్జతలుతెలిపిన రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డి, ఇతర వికలాంగుల సంఘాల నేతలు. ఫోటోలో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News