Saturday, October 5, 2024
HomeతెలంగాణChegunta: కర్నాల్ పల్లి సాయిబాబా దేవాలయాన్ని దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి

Chegunta: కర్నాల్ పల్లి సాయిబాబా దేవాలయాన్ని దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి

అందుకే అజంతా ఎక్స్ ప్రెస్ ఆపించా

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 18వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై, చండీ హోమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని సాయిబాబా దేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా కర్నాల్ పల్లి గ్రామానికి వచ్చినట్టు అనిపిస్తుందని వారు అన్నారు. అజంతా ఎక్స్ ప్రెస్ రైలును ఆపింది వడియారం రైల్వే స్టేషన్ లో షిరిడి సాయిబాబా కోసమేనని వారన్నారు. వడియారం రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల వారంతా షిరిడికి వెళ్తారని, అందుమూలంగా రైల్వే అధికారులను కలిసి అజంతా ఎక్స్ ప్రెస్ స్టాప్ ను వడియారం రైల్వే స్టేషన్ లో ఆపించానన్నారు. సాయిబాబా మహత్యం చాలా గొప్పదని వారు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముదాం శ్రీనివాస్. చేగుంట మండల బారాస పార్టీ అధ్యక్షులు కోమండ్ల నారాయణరెడ్డి, బారాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News