Wednesday, April 2, 2025
HomeతెలంగాణKTR: ఏసీబీ కేసు.. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

KTR: ఏసీబీ కేసు.. హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్

ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ నమోదుచేసిన కేసుపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టాలని కోరారు. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

- Advertisement -

కాగా ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News