Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

Mallapur: రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణ మాఫీ

బి ఆర్ఎస్ బిజెపి నాయకులది రాజకీయ ఆరాటమని, రైతుల ముసుగులో డ్రామాలు ఆడుతున్నరని, తమ స్వార్థం కోసం రైతులను పక్కదారి పట్టిస్తున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి రాజ శేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ
రైతుల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్న బిజెపి , తెరాస నాయకులు ఒకటి గమనించాలనీ, రైతులని ముంచిన ఘనత ఇంతకు ముందు ప్రధానమంత్రి మోడీ , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులది అని, ఎవరు మంచి వారో రైతులకు తెలుసనీ, మీరు ఎన్ని దొంగ దీక్షలు చేసిన రైతులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారని, కచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టమైన హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది లేనిపోని రాజకీయ కోణంలో మీరు అకారణంగా అనవసరంగా రాజకీయం కోసం రైతులు వాడుతున్నారు తప్ప మీ దగ్గర నీతి నిజాయితీ రెండు లేవని తెలంగాణ రైతాంగానికి అందరికి తెలుసనీ అన్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి న్యాయం జరిగలేదని, గత పది సంవత్సరాల నుంచి అటు బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకి న్యాయం చేయలేరని, రైతుల్ని మోసం చేసి రైతుల మీద రాజకీయం చేసిన ఘనత కేసిఆర్, నరేంద్ర మోడీ లకు దక్కుతుందని, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు చేస్తానన్న రుణమాఫీ ఎంత మందికి చేశారు. రైతులకు ప్రజా ప్రభుత్వంలో న్యాయం కలుగుతుందని నమ్మండి అని రాజశేఖర్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News