Sunday, October 6, 2024
HomeతెలంగాణManchireddy Kishan Reddy: మానవీయ కోణంలో కేసీఆర్ పాలన

Manchireddy Kishan Reddy: మానవీయ కోణంలో కేసీఆర్ పాలన

దివ్యాంగులకు పించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మానవీయ కోణంలో పరిపాలన సాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి మనమంతా అండగా నిలబడాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని భారత్ గార్డెన్స్ లో జరిగిన “దివ్యాంగుల పింఛన్ల పంపిణీ” కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకి పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ..గత ప్రభుత్వాలు చాలీచాలని పింఛన్లతో ప్రజలను గోసపెట్టాయని, కానీ కేసీఆర్ వారికి కడుపునిండా పథకాలు ఇచ్చి అండగా నిలబడుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News