Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: ఏజీఎం ఫైనాన్స్ రాజేశ్వర్ రావుకు సన్మానం

Manchiryala: ఏజీఎం ఫైనాన్స్ రాజేశ్వర్ రావుకు సన్మానం

సింగరేణి ఆర్థిక విభాగంలో అడిషనల్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన బి.రాజేశ్వర్రావు అంకితభావంతో సంస్థకు పనిచేశారని ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగే కోట్లాది రూపాయల బొగ్గు అమ్మకాలు తదితర లావాదేవీలలో కీలకపాత్ర పోషించారని సింగరేణి సంస్థ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం రోజున ఇటీవల పదవీ విరమణ చేసిన బి.రాజేశ్వర్ రావును సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, ఎన్.బలరామ్, డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె.శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి.వెంకటేశ్వర్ రెడ్డి ఘనంగా సన్మానించి ప్రశంసించారు. డైరెక్టర్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ… కంపెనీకి రావల్సిన బకాయిల వసూలు, ఆర్థిక వెసులుబాటు తదితర అంశాల్లో రాజేశ్వర్ రావు కంపెనీకి విశేషమైన సేవలు అందించారని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా ఉద్యోగులకు అమలు జరుపుతున్న కార్పోరేట్ శాలరీ అకౌంట్, ఇన్సూరెన్స్ స్కీం అమలులో కూడా ప్రత్యేక చొరవ చూపారన్నారు. డైరెక్టర్లు మాట్లాడుతూ రాజేశ్వర్ రావు వివిధ హోదాల్లో వివిధ ఏరియాలలో పనిచేసినప్పుడు కూడా అందరి ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ద్వారా జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని రాజేశ్వర్ రావుకు అందించి అభినందించారు.
ఈ సమావేశంలో అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, జనరల్ మేనేజర్ సీపీపీ సి.హెచ్.నరసింహరావు, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కె. సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ (పి అండ్ పి) కె.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News