Friday, September 20, 2024
HomeతెలంగాణIbrahimpatnam: ఆదిభట్లలో మర్రి నిరంజన్ పర్యటన

Ibrahimpatnam: ఆదిభట్లలో మర్రి నిరంజన్ పర్యటన

పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలు సహకరించాలి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీ లో పారిశుద్ధ కార్మికులతో కలిసి కాలనీలలో ఉన్న మురుగును పరిశీలించి చెత్తాచెదారంను శుభ్రం చేయించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున ముందు జాగ్రత్తగా మురికి కాలువలను శుభ్రం చేయించి ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించకపోవడం వలన సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతను పాటించి సహకరించాలన్నారు. ముఖ్యంగా మురికి కాలువలపై చెత్త చెదారం ఉన్న పరిసర ప్రాంతాలలో దోమల నివారణకు మందును, బ్లీచింగ్ పౌడర్ ను చల్లిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ సిబ్బంది కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News